అమలాపురంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల నందు ఈ నెల 14వ తేదీన నిర్వహించే ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. అందుకు సంబందించి రూపకల్పన పై ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. సైన్స్ ఫెయిర్లు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి పేర్కొన్నారు.
బుధవారం సమన్వయ కమిటీ సమావేశం బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డి.ఈ.ఓ. కమల కుమారి మాట్లాడుతూ… ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పాఠశాల నుంచి ఇప్పటికే ఎంపికైన 72 ప్రాజెక్టులు ప్రదర్శనకు తీసుకురావాలన్నారు.
జిల్లా సైన్స్ అధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ… ఇన్స్పైర్ మనాక్ లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంపిక కాబడిన 72 ప్రాజెక్టులకు ప్రతి విద్యార్థికి రూ. పదివేలు వంతున విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జూన్ నెలలోనే జమ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు బి.వి.వి. సుబ్రహ్మణ్యం, డి. రమేష్ బాబు, పి. రాంబాబు, అమలాపురం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజరాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.