ఇరాన్లో పర్యటించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. కాశ్మీర్పై పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ తన పాకిస్తానీ అతిధేయల పట్ల స్పష్టమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇరాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్తో సమావేశం అయ్యారు. సమావవేశం అనంతరం మీడియా ప్రకటనలో కాశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించకుండా దాటవేయాలని నిర్ణయించుకున్నాడు.
షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా తమ దేశాల మధ్య సహకారాన్ని ఎలా పెంపొందించుకోవాలో చర్చిస్తూనే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య స్థాయి ఆమోదయోగ్యం కాదని, రెండు దేశాలు దీనిని USD 10 బిలియన్లకు పెంచాలని నిర్ణయించుకున్నాయని ఇరాన్ అధ్యక్షుడు రైసీ సంయుక్త వార్తా సమావేశంలో పేర్కొన్నారు.
మూడు రోజుల అధికారిక పర్యటన కోసం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం పాకిస్థాన్ చేరుకున్నారు, ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్తో సహా ఆ దేశ సీనియర్ నాయకత్వాన్ని కలవనున్నారు. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ దేశాధినేత పాకిస్థాన్లో పర్యటించడం ఇదే తొలిసారి.