ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం నాడు భారీ పొగమంచుతో పర్వతాలను దాటుతుండగా కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ను ఉటంకిస్తూ ఒక నివేదిక తెలిపింది. రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్లో ఉన్నట్లు సమాచారం.
రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ జీవితాలు హెలికాప్టర్ క్రాష్ తరువాత ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది. ఇది ఇరాన్ యొక్క వాయువ్య ప్రాంతంలోని అజర్బైజాన్ సరిహద్దును సందర్శించి తిరిగి వచ్చే మార్గంలో జరిగిందని. వెళ్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రపంచ నాయకులు క్రాష్ వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.