పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామ శివారు వుప్పర గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటాకు ఇళ్ళు దగ్ధమై సుమారు రూ. 30 లక్షల ఆర్థిక నష్టం సంభవించింది. ఈ ఘటనతో నిరాశ్రయులైన తొమ్మిది కుటుంబాల వారిని పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పరామరిశించారు. నిరాశ్రయులైన వారికి బియ్యం, నగదు అందజేశారు. బాధితులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని అధైర్య పడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చా అప్పాజీ, వొంకా కొండబాబు, మాదేపల్లి శ్రీను, నల్లం శ్రీను, సరిపళ్లి నాగేశ్వరరావు, అడపా శివరామ కృష్ణా, బలిరెడ్డి గంగబాబు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.