Viral

ఇసుక ర్యాంపులు నిలుపుదలపై ఎం.ఎల్.ఏ. జగ్గరెడ్డి విమర్శలు…

98a0563e-c320-4f15-b621-fa6920fddf72

ఇసుక ర్యాంపులు నిలుపుదల చేసి తెలుగుదేశం నాయకులు వేలాది మంది కార్మికుల పొట్ట కొడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ… ఆయన కొత్తపేట నియోజక వర్గంలో ఏడు ఇసుక ర్యాంపులు ఉన్నాయని 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కొత్తపేట తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దురుద్దేశ పూర్వకంగా ఇసుక తవ్వకాలు నిలుపుదలకు కృషి చేశారన్నారు.

ఇసుక తవ్వకాలు నిలిపివేసిన కారణంగా ఇటు ర్యాంపుల్లో పనిచేసే కార్మికులతో పాటు ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. ఇసుక కొరత వలన అధిక రేట్లు వలన పనులు నిలిచిపోయి కార్మికులు గృహ నిర్మాణం లబ్ది దారులు నష్టపోతున్నారని అన్నారు. కార్మికులు కలెక్టర్ ఆఫీసుకి చేరుకొని కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఇసుక ర్యాంపులు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎం.పీ.పీ. మార్గాన్ని గంగాధర్ రావు, జగ్గిరెడ్డి, తదితరులు ఉన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.