భారతదేశ వాతావరణ పరిశోధనకు దోహదపడే అధునాతన ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. చంద్రయాన్-3 తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్ ను దించి, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను సంధించి విజయం సాధించిన ఇస్రో సంస్థ అదే పరంపరలో ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణమని అన్నారు. ఇన్సాట్-3 డీ.ఎస్ గా నామకరణం చేసి విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు. మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అంతరిక్ష యవనికపై భారత జైత్ర యాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలపై పవన్ వ్యాఖ్యలు…
![74884490](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/74884490.jpg?resize=769%2C600&ssl=1)