కాకినాడ సిటీలోని పి.ఆర్. కాలేజీ, మెక్లారిన్ హైస్కూల్ నడుమ రహదారుల్లో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ లోకి ప్రజారోగ్య సంక్షేమం దృష్ట్యా మోటారు వాహనాల ప్రవేశం నిషేధించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆర్.టి.సి. బస్సులు, ట్రావెలర్స్ బస్సులు, వాటర్ ట్యాంకర్లు, లారీలు, తదితర వాహనాలు ప్రవేశం పార్కింగ్ పూర్తిగా తొలగించాలన్నారు. వాహనాల ట్రాఫిక్ తో ఎగసి పడుతున్న దుమ్ము ధూళితో దుర్గంధం వ్యాపించి ఈట్ స్ట్రీట్ ఆహారం కలుషితం అవుతున్న దుస్థితి ఎక్కువగా వుందన్నారు.
అనారోగ్యకరంగా తయారైన ఈట్ స్ట్రీట్ ను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రజారోగ్య విభాగ అధికారులపై వుందన్నారు. పి.ఆర్. కాలేజ్ ప్రహారీ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయ ప్రహారీ లోపలి వైపుగా రోడ్డుకి రెండు వైపులా ఈట్ స్ట్రీట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే ఇటువంటి దుర్గతి వుందన్నారు. వెయ్యికోట్లు వెచ్చించిన స్మార్ట్ సిటీ ప్రణాళికలో ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించలేకపోయిందన్నారు.