భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను సందర్శించడానికి ప్రయాణిస్తూవుంటారు. ప్రస్తుతం పలు దేశాలు వీసా లేకుండ ప్రాయణించే అవకాశాన్ని కల్పించాయి. 23 దేశాలు భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసీ రహిత ప్రయాణాన్ని అనుమతించాయి. అయితే మరో 32 దేశాలు భారతీయ పౌరులకు వీసా-ఆన్-అరైవల్ను యాక్సెస్ చేయడానికి అనుమతించాయి.
అయితే ఇప్పుడు భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ దేశం తాజాగా ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రముఖ ప్రయాణ ప్రాంతాలైన థాయ్లాండ్, శ్రీలంక ప్రభుత్వాలు థాయ్లాండ్కు ఏప్రిల్ 2024 వరకు, శ్రీలంకకు మార్చి 2024 వరకు భారతీయ పౌరులకు వీసా రహితంగా ప్రకటించబడ్డాయి.