ఈ నెల 11న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది సీ.ఎస్. జవహర్రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సమావేశం నిర్వహిస్తామని ఆయన అన్నారు. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సీ.ఎస్. ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదంతో సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 11న కేబినెట్ భేటీ….
![WhatsApp Image 2023-12-04 at 1.19.57 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-1.19.57-PM.jpeg?resize=676%2C473&ssl=1)