కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్, ఆర్డీవో కిషోర్, కమిషనర్ వెంకటరావు కు జర్నలిస్టులు మిఠాయిలు అందజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టులు స్వీట్స్ అందుకున్నారు.
దాని తర్వాత కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలను జర్నలిస్టులు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పచ్చడను సీనియర్ జర్నలిస్టు ఎల్. శ్రీనివాసరావు తోటి జర్నలిస్టులకు అందజేసి, స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతి పండుగను జర్నలిస్టులు అందరూ ఆనందంగా గడుపుకోవాలని పలువురు సీనియర్ పాత్రికేయులు అభిలాషించారు. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అందించిన స్వీట్స్ ని అందుకునే పలువురు ఆనందం వ్యక్తం చేశారు.