2024-25 విద్యా సంవత్సరంలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. హెచ్ఐవీ బాధితులు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాధలు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామని ఆయన వెళ్లడించారు. ఒకటో తరగతి నుంచి ప్రవేశానికి ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు వారి ఆధార్ వివరాలతో http: -cse.ap.gov.in సైట్ లో అప్లై చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మండల విద్యాశాఖాధికారి లేదా జిల్లా విద్యాశా ఖాధికారిని గానీ, 18004258599 టోల్ ఫ్రీ నం బరును సంప్రదించాలని సూచించారు.