డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ..ఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో 32 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేస్తున్న పి.ఎస్. శిరోమణి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆమె చేసిన సేవలను కొనియాడారూ. అనంతరం శిరోమణిదంపతుల ను సన్మానించడం జరిగింది.
ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ.ఎస్. శిరోమణి ఉద్యోగ విరమణ…!!!
![WhatsApp Image 2024-02-01 at 7.55.48 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-01-at-7.55.48-PM.jpeg?resize=540%2C700&ssl=1)