ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్లో సెక్టార్ 3లో గల కిన్స్ ఫ్లోక్ హోటల్ అండ్ బ్యాంకెట్ హాల్ లో మ్యారేజ్ యానివర్సిరీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ బ్యాంకెట్ హాల్ లో మంటలు చెలరేగినట్లు అక్కడ స్తానికులు తెలిపారు. ఆ మంటలు గాలి తీవ్రకు 2, 3 ఫోర్ల వరకు మంటలు వ్యాపించినట్లు చెప్పారు. స్తానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న 60 మందిని అగ్ని మాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడ అధికారులు తెలిపారు.