ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని రిషికేశ్-బద్రీనాథ్ హైవే సమీపంలో టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. దానితో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. హైవేపై అలకానంద నది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
వాహనంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తెలిపింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్య కేంద్రానికి తరలించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన ధామి ఈ విషయంపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశించినట్లు చెప్పారు.