గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.