జిల్లాలో 10,485 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ద్వారా ఉపాది నైపుణ్యాలలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్ లో వికాస సంస్థ, జే.ఎన్.టీ.యూ., ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులకు వచ్చే జనవరి నెల నుండి ఇంటర్న్ షిప్ కార్యక్రమాల ద్వారా ఉపాది శిక్షణ కల్పన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న 10,485 మందికి వివిధ ప్రభుత్వ విభాగాలలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ నిర్వహించాలని అధికారులను కోరారు.
వికాస సంస్ధ నోడల్ ఏజెన్సీగా జిల్లా అధికారులు, యూనివర్సిటీల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాలకు నిర్థిష్ట ప్రణాళికను సిద్దం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వికాస సంస్థ ప్రోజెక్ట్ డైరక్టర్ కె.లచ్చారావు, జెఎన్టియూ రిజిష్ట్రార్ ఎ.సుమలత, ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిష్ట్రార్ జి.సుధీర్, జియం డిఐసి మురళి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ రాధాకృష్ణ, కార్మిక శాఖ ఎసి బుల్లిరాణి, సిపిఓ తినాద్, డిఈఓ జి.నాగమణి, ఎపిఎస్సిహెచ్ఇ నోడల్ అధికారి చంద్రశేఖర్, అక్నూ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిలర్ జగన్మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాది నైపుణ్యాలలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కల్పించాలని… -కలెక్టర్ డా.కృతికా శుక్లా-
![WhatsApp Image 2023-11-27 at 8.30.52 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-8.30.52-PM.jpeg?resize=1280%2C700&ssl=1)