Exclusive

ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలి… -తాటిపాక మధు-

WhatsApp Image 2024-05-16 at 12.50.13 PM

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుకునంగా రూ. 600 వేతనం పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ పిఠాపురం య. కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం చేర్పింపు కార్యక్రమం జరిగింది, అలాగే 3 గ్రామ కమిటీలు వేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో వచ్చే ఇండియా కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రూ. 600 వేతనం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఈ నేపథ్యంలో పెరిగే ధరలు అనుకూలంగా రూ. 600 వేతనం ఇస్తేనే ఉపాధి హామీ కూలి సంతోషంగా ఉంటారని మధు పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే గ్రామీణ కార్మికులు పట్టణాలకు వలసలు పోతారని ఆయన గుర్తు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.