ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విజ్ఞాపన పత్రం డిప్యూటీ ఎమ్మార్వో రవి ప్రసాద్ కి అందచేసారు. ఈ సందర్బంగా ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐ.అర్. మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, జీవో 117 రద్దు చేయాలని అన్నారు.
పాత పెన్షన్ విధానం ఓ.పి.ఎస్. పునర్ధరించాలని,పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పెండింగ్ డి.ఏ. లు ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శులు బూర్ల సత్యప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్, డి.ఎ. రాజశేఖర్, శ్రీరామ్ జి.సురేష్, ప్రత్తిపాడు మండల బాధ్యులు కే.ఎస్. సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.