డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలంలో ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయరాలు రాణి అధ్యక్షతన ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్దులకు జగనన్న ట్యాబ్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సంపదరావు మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్.పీ.టీ.సీ. గెడ్డం సంపదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు రాణి, వై.సీ.పీ. కార్యక్రతలు, తదితరులు పాల్గొన్నారు.