ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పొత్తుకు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని అన్నారు.
ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి మహా సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సభ వేదిక, పరిసరాలను పరిశీలించి సభ ఏర్పాట్ల కమిటీకి తగు సూచనలు ఇచ్చారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని చెప్పారు. మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని అలాగే ఇతర ఏర్పాట్లను వారికి ప్రత్యేకంగా చూడాలని సూచించారు.