విజయవాడలో లేనిన్ సెంటర్ లో విపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెండ్ పై ఇండియా కూటమి నిరసనను వ్యక్తంచేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ వ్యవస్థ పై ఆందోళన వ్యక్తం చేసిన విపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ… లెనిన్ సెంటర్ లో నల్ల రిబ్బన్లు, ప్ల కార్డులు, నల్ల బెలూన్లు పట్టుకుని నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహరావు మాట్లాడుతూ… పార్లమెంట్ లో రక్షణ కలపించడంపై నర్లక్ష్యం వహించిన పీ.ఎం. మోడీ, అమిత్ షా లు రాజీనామ చేయాలని అన్నారు. సీ.పీ.ఐ. నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ… పార్లమెంట్ పై జరిగిన దాడి పై మాట్లాడిన 146 మంది ఎం.పీ. లను సస్పెండ్ చేయడం సమంజసం కాదని మండిపడ్డారు.