ఎం.ఎల్.ఏ. వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడిన వ్యాక్యలపై వై.సి.పి. రాష్ట్ర నాయకులు మరియు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజ బాబు ఘాటు సమాధానమిచ్చారు. ప్రొటోకాల్పై మాట్లా డే అర్హత ఎం.ఎల్.ఏ. కు లేదని ఎద్దేవా చేసారు. గతంలో అప్పటి కౌన్సిలర్ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుండగా ఎం.ఎల్.ఏ. తమ వార్డులోని పనులు అన్నీ పూర్తి చేసిన తరువాతే మీ వార్డు పనులు చేస్తామని చెప్పిన సంగతిని గుర్తులేదా అని అడిగారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాల్లో గెలిచిన వారిని పక్కన పెట్టి ఓడిపోయిన వారికి పెత్తనమిచ్చిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు.
ఎం.ఎల్.ఏ. వేగుళ్ల వ్యాక్యలపై రెడ్డి రాజబాబు ఘాటు సమాధానం…
![OIP (7)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/OIP-7-1.jpg?resize=474%2C284&ssl=1)