జూన్ 03న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ను మోడీ పోల్ అని పిలిచినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా తప్పుబట్టారు. యాక్సిస్ మై ఇండియా మరోసారి సరైనదని రుజువు చేస్తుందని కూడా తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… యాక్సిస్ మై ఇండియా గత 10 సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ను నిరంతరం నిర్వహిస్తోందన్నారు.
2 లోక్సభ ఎన్నికలతో సహా 69 ఎన్నికలకు తాము ఆ పని చేసామని, మా అంచనాలు 65 సార్లు సరైనవని చెప్పారు. విశ్వసనీయత విషయానికొస్తే, ప్రశ్నలు లేవనెత్తే వ్యక్తులు మా ట్రాక్ రికార్డ్ను పరిశీలించాలన్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. యాక్సిస్ మై ఇండియా కరెక్ట్ అని మరోసారి రుజువు అవుతుందని తెలుసుకుని రాహుల్ గాంధీ కూడా సంతోషిస్తారని భావిస్తున్నానన్నారు.