Exclusive

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…

4c644b32-3ad0-4a11-b73c-1837a4a5b8ac

ఉమ్మడితూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ స్పెషల్ షో ను వేసారు. అందులో వచ్చిన ఆదాయాన్ని ఆదివారం అమలాపురం శేఖర్ థియేటర్ దగ్గర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పేద ఎన్టీఆర్ అభిమానుల కుటుంబాలకు, విద్యార్థిని, విద్యార్థుల చదువులకు ఆ డబ్బుని చెక్కుల రూపంలో అందచేసి వారికి భరోసానిచ్చారు. అనంతరం టీ.డీ.పీ. పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా అమలాపురం పట్టణ శేఖర్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు భారీ అన్న సమరాధనా ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సుమారు మూడు లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందజేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా మరణించిన ఎన్టీఆర్ అభిమానుల కుటుంబాలయిన దొంగ ఈశ్వరరావు కుటుంబానికి 50,000 వేల రూపాయలు, అప్పారి శ్రీహరి కుటుంబానికి 40,000 వేల రూపాయలు, ఖండవల్లి ప్రదీప్ కుటుంబానికి 40,000 వేల రూపాయలు, రాపాక శివరాం కుటుంబానికి 40,000 వేల రూపాయలు అందజేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.