అమలాపురంలో ఎమ్మెల్యేగా టికెట్ సాధించి మొదటిసారి అమలాపురం వచ్చిన ఆనందరావుకు స్థానిక మెట్ల రమణ బాబు గృహం వద్ద తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ… డబ్బు ఉంటేనే ఎమ్మెల్యే సీటు సాధించలేమని కార్యకర్తల అభిమానం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తనకు ఎమ్మెల్యేగా సీటు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందుకు చంద్రబాబుకు తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ గెలిచి అసెంబ్లీలో కూర్చోవడం జరుగుతుందని, జగన్ జైల్లో కూర్చోవడం జరుగుతుందని చెప్పారు. గంజాయి రవాణాలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ముందంజలో ఉందని 50 రూపాయలు చీప్ లిక్కర్ 200 రూపాయలకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పార్టీని ఓడించి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి అధిక మెజార్టీ నుంచి అటు కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లాడి శరత్, నేతాజీ, సత్తిబాబు రాజు, తదితరులు పాల్గొన్నారు.