లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్య విజయమని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీ.జే.పీ. కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ… ఎన్నికలను విజయవంతం చేసినందుకు భారత ఎన్నికల కమిషన్కు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 1962 తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి అని ఆయన సూచించారు.
ఒడిశాలో బీ.జే.పీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహాప్రభు జగన్నాథుని భూమిలో బీ.జే.పీ. సీ.ఎం. కావడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈరోజు తెల్లవారుజామున, ఎన్.డీ.ఏ. మూడవసారి అధికారంలోకి వచ్చినందుకు ప్రధాని మోడీ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశ చరిత్రలో అపూర్వమైన క్షణమని పేర్కొన్నారు.