ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవ్వడంతో అన్ని పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అదేంవిదంగా వై.సీ.పీ. పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ తుని పట్టణంలో 25 వ వార్డు లోని రామ కృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చైర్ మెన్ ఏలూరు సుధారాణి, నియోజవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటికీ కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.