Political

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీయే అభ్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌…

rajeev-chandra-sekar_1200x630xt

తిరువనంతపురంలో ఎన్డీయే అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో నియోజకవర్గంలోని తీరప్రాంతాల్లో ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. పేట అక్షరవీధి నగర్‌లో అభ్యర్థికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసారు. దారిని పూలదండలు, బీ.జే.పీ. జెండాలతో అలంకరించారు. పార్టీ కార్యకర్తలు మద్దతుదారులకు శాలువాలు పంచే పనిలో నిమగ్నమయ్యారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో కూడిన మోస్తరు గుంపు తమ అభ్యర్థి రాక కోసం వేచి ఉంది.

సాధారణంగా వామపక్షాలకు కంచుకోటలుగా పేరొందిన చాకై, పేటలో బీ.జే.పీ. మెల్లగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తుంది.
ఈ సందర్బంగా బీ.జే.పీ. పశ్చిమ మండల కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ… మేము ఇప్పుడు సీ.పీ.ఎం. కంటే బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పుడు వారిదే పైచేయి అని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.