తిరువనంతపురంలో ఎన్డీయే అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో నియోజకవర్గంలోని తీరప్రాంతాల్లో ఓటర్లను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. పేట అక్షరవీధి నగర్లో అభ్యర్థికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసారు. దారిని పూలదండలు, బీ.జే.పీ. జెండాలతో అలంకరించారు. పార్టీ కార్యకర్తలు మద్దతుదారులకు శాలువాలు పంచే పనిలో నిమగ్నమయ్యారు. వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో కూడిన మోస్తరు గుంపు తమ అభ్యర్థి రాక కోసం వేచి ఉంది.
సాధారణంగా వామపక్షాలకు కంచుకోటలుగా పేరొందిన చాకై, పేటలో బీ.జే.పీ. మెల్లగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తుంది.
ఈ సందర్బంగా బీ.జే.పీ. పశ్చిమ మండల కార్యదర్శి ప్రేమ్కుమార్ మాట్లాడుతూ… మేము ఇప్పుడు సీ.పీ.ఎం. కంటే బలపడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పుడు వారిదే పైచేయి అని అన్నారు.