Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులు బదలాయింపుల రిజిస్ట్రేషన్ ఆపండి….

WhatsApp Image 2024-02-13 at 3.16.56 PM

కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం కాకినాడ ప్రజల ఉపాధి కోసం 1985లో దివంగత కె.వి.కె. రాజు కాకినాడలో యూరియా తయారీ కర్మగారాన్ని నిర్మించారని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఇక్కడ యూరియా హబ్ గా అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు కాకినాడ ప్రజలు ముఖ్యంగా యాళ్ళ వారు, రైతులు, ప్రభుత్వం కలిసి 1000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి పరిశ్రమ నిర్మించారన్నారు.

నేడు కె.వి.కె. రాజు గారి మనవడు, ప్రభుత్వ పెద్దలు దురుద్దేశంతో ఎన్.ఎఫ్.సి.ఎల్. భూములు స్వాధీనం చేసుకోవడం కోసం గ్రీన్ కో అనే సంస్థ ద్వారా తప్పుడు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వాటి ఆస్తులను అప్పనంగా కొట్టేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వద్ద నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కుట్ర చేశారని అన్నారు.

అందులో భాగంగానే ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తుల బదలాయింపులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని దీన్ని వెంటనే నిలిపివేయాలని సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాదులతో కలిసి కాకినాడ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి వినతిపత్రం అందజేశామని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.