నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం జూన్ 9వ తేదీనా కరారు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన పలువురు ప్రపంచ నాయకుల సమక్షంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. వేడుకకు ముందు బీ.జీ.పీ. నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మోడీని తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు శుక్రవారం సమావేశం కానున్నారు.
మోడీని ఎన్.డీ.ఏ. నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత, కూటమిలోని టీ.డీ.పీ. అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, జే.డీ. నితీష్ కుమార్ వంటి కొంతమంది సీనియర్ సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశానికి ప్రధానితో కలిసి జాబితాను ఆమెకు అందించనున్నారు. గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్, అతని బృందం రాష్ట్రపతిని కలిసి, కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను ఆమెకు సమర్పించారు.