ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్ర పటానికి స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం., ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా సీ.పీ.ఎం. రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ… సాబ్జీ మరణం ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని అన్నారు.
మన రాష్ట్రంలో యు.టి.ఎఫ్. నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు కె.ఎస్.శ్రీనివాస్, ఆర్. పి.ఐ. రాష్ట్ర నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి టి.రాజా, తదితరులు పాల్గొన్నారు.