హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి బాధితులు ధైర్యంగా జీవించాలని, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించేందుకు త్వరలో మందులు వచ్చేందుకు వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్క రించుకొని స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు ఏర్పాటు చేసిన అల్పాహారం విoదులో జిల్లా కలెక్టర్, ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు సాయి రాజ్ సాత్విక్ తో కలిసి పాల్గొని అల్పాహారాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మానవాళి మనుగడకు పెనుసవాలుగా మారిన ఎయిడ్స్ గురించి ఎన్నో ఆపోహలు, అనుమానాలు, భయాలకు లోనుకాకుండా మనో ధైర్యాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకొని వైద్యుల సూచనల మేరకు మంచి జీవన శైలిని అలవర్చుకొని జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలన్నారు.
ఇటీవల జరిగిన పరిశోధనల వల్ల శక్తివంతమైన మందులు, ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయంచేసేవి అందుబాటులోకి వచ్చాయన్నారు. సురక్షిత రక్తం మార్పిడి ద్వారా హెచ్ఐవి శాతాన్ని తగ్గించడం జరుగుతోoదన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిహెచ్వి భరతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-
![WhatsApp Image 2023-12-01 at 1.06.35 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-01-at-1.06.35-PM.jpeg?resize=1296%2C700&ssl=1)