కాకినాడ జిల్లాలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశానుసారం కాకినాడ క్రైమ్ డిఎస్పి రాంబాబు సూచనల మేరకు ఎల్ హెచ్ ఎం ఎస్ (Locked House Monitoring System) కెమెరాలు ఉపయోగించడం పట్ల పోలీసులు ఆటోలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా అరికట్టడంతో పాటు దొంగలను సులువుగా పట్టుకునేందుకు వీలవుతుందని పోలీసులు అవగాహణ కల్పిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటికి తాళం వేసి దూర ప్రయాణాలకు వెళ్లే సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారము తెలియజేయాల్సిందిగా సూచిస్తున్నారు. పండుగల నేపధ్యంలో ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లదలస్తే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసినట్టైతే సంబంధిత పోలీసులు ఇంటిపై నిఘా పెట్టేందుకు కెమెరాలను అమర్చుతారు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితమని, ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని దొంగతనాలకు ఆష్కారం లేకుండా సహకరించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఆటోలో జనసమ్మర్థం కలిగిన ప్రాంతాల్లో మైక్ ప్రచారంతో ఏఎస్ఐ పుల్లయ్య, సిబ్బంది అవగాహణ కల్పిస్తున్నారు.