విభజిత ఆంధ్రప్రదేశ్ 3వ ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర ప్రజలు తెదేపా, జనసేన, బీ.జే.పీ. కూటమి కి 93%శాతం మెజారిటీ తో సార్వత్రిక ఎన్నికల్లో 164అసెంబ్లీ స్థానాలు 21పార్లమెంట్ స్థానాల కైవసానికి అవకాశం ఇవ్వడం పట్ల పౌర సంక్షేమసంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కాకినాడ జిల్లా కేంద్రం లోని సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంత్రి పదవికి స్థానం కేటాయించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు కోరారు.
తెదేపా ఆవిర్భా వం 1982లో ఉమ్మడి ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాకేంద్రం కాకినాడ సిటీ నుండి ఎన్నికైన ఎమ్మెల్యే ముత్తా గోపాల కృష్ణ పౌరసరఫరాల శాఖ మంత్రిగా 1989 లో కాంగ్రెస్ నుండి ఎన్నికైన దివంగత మల్లాడిస్వామి మత్స్య శాఖ మంత్రిగా అవకాశం దక్కిందని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా కేంద్రంలో సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వనమాడి వేంకటేశ్వర రావు కు మంత్రి వర్గంలో స్థానం కల్పించి జిల్లా కేంద్రానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
2024 -29 ఎన్నికల సందర్భం గా ప్రకటించిన కాకినాడ ప్రగతికి చెందిన 108 అంశాల పౌరఅజెండా పరిష్కారానికి సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వేంకటేశ్వర రావు అలియాస్ కొండబాబు, పంతం వేంకటేశ్వర రావు అలియాస్ నానాజీ కృషి చేయాలని కోరారు. వారికి ప్రత్యేక అభినం దనలు తెలియజేశారు.