రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డి. రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 42 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు 42 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెళ్లడించారు. వైయస్సార్ కడపలో 18 మండలాలు, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.