పాఠశాలలకు శెలవు… పరీక్ష వాయిదా…!!!
![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/school-holiday.jpg?resize=640%2C360&ssl=1)
ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది… ముందెన్ననూ వినలేదు… చూడలేదు. ఉన్నట్టుండి స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం… పరీక్షలు వాయిదా వేయించడం… విద్యార్థులను మీటింగ్లకు తరలించడం. రాజకీయ పార్టీల మీటింగ్స్ విద్యార్థుల తోనే ముడిపడి ఉన్నాయా..? వారి ఉజ్వల భవిష్యత్ రాజకీయ జన సమీకరణకు దోహదపడుతుందా..? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ విషయమై ప్రతిపక్షాలు, వామపక్షాలు నోరు మెదపకపోవటం విశేషం.
ఈ నెల 2, 3 తేదీలలో ఇంటర్మీడియట్ ఎథిక్స్ అండ్ హుమన్వేల్యూస్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా 3 వ తేదీన నిర్వహించనున్న పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షను తిరిగి 23వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈనెల 3న ఏలూరులో ముఖ్యమంత్రి సభ జరగనున్న నేపధ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా పాఠశాలలు, కళాశాలలక సెలవులు ప్రకటించడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.