ఆంధ్రప్రదేశ్లో 19 మంది సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి పీ.ఎస్. ప్రద్యుమ్నను ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే బ్యాచ్కు చెందిన భాస్కర్ కాటంనేని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏ.పీ.సీ.ఆర్.డీ.ఏ. కమిషనర్గా నియమితులయ్యారు.
2008 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన వి. వినయ్ చంద్ ప్రభుత్వ, ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మరోవైపు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు వై. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్లను తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.