ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ సంవత్సరం వాలంటీర్లుకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పరిష్కారాలకు సంబంధించిన అమౌంట్ ను రెట్టింపు చేయబోతున్నారని సమాచారమిచ్చింది. ప్రతీ సంవత్సరం సేవా పురస్కారాల కోసం 250 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ సారి రెట్టింపు చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
ప్రతీ ఏటా సేవా పురస్కారాలు మూడు కేటగిరీ కింద ఇస్తున్నారు. సేవా వజ్ర కింద రూ. 30000, సేవా రత్న కింద రూ. 20000 మరియు సేవా మిత్ర రూ. 10000 ఇస్తుండేవారు. ఇప్పుడు సేవా వజ్రకు రూ. 60000, సేవా రత్నకు రూ. 40000 అదేవిదంగా సేవా మిత్ర రూ. 20000 కు పేంచి ఇవ్వనున్నట్లు వెళ్లడించింది. 2024 సేవా పురస్కారాలు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉండవచ్చని సమాచారం.