భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రదానం చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్ మరియు పి.వి. నరసింహారావు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు హరిత విప్లవానికి రూపశిల్పి ఎం.ఎస్. స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ప్రదానం చేసారు.
చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, కర్పూరి ఠాకూర్, మరియు ఎంఎస్ స్వామినాథన్లకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. కాగా, ఎల్.కే. అద్వానీకి ఆయన నివాసంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. భారతరత్న ప్రదానం కార్యక్రమం కారణంగా రాష్ట్రపతి భవన్లో గార్డు మార్పు వేడుక జరగలేదని రాష్ట్రపతి సచివాలయం తెలిపింది.
కర్పూరీ ఠాకూర్కు భారతరత్న అవార్డును ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ అందుకున్నారు. భారత ప్రభుత్వం అతని పనిని గుర్తించి అతనికి ఈ అవార్డును ఇచ్చిందని, ఆయనకు అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేసినందుకు దేశం తరపున, ప్రధాని మోడీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఠాకూర్ తెలిపారు.
ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె నిత్యారావు అవార్డును అందుకున్నారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కోసం, రాష్ట్రీయ లోక్ దళ్ ఇటీవల బీ.జే.పీ. నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో చేరిన అతని మనవడు మరియు రాజ్యసభ ఎం.పీ. జయంత్ చౌదరి ఈ అవార్డును అందుకున్నారు.