న్యూఢిల్లీలోని బీ.జే.పీ. పార్లమెంటరీ పార్టీ శుక్రవారం ఒడిశా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో రాష్ట్ర అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను 78 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ఒడిశాలో బీ.జే.డీ. 24 ఏళ్ల పాలనకు బీ.జే.పీ. ముగింపు పలికింది. కొత్తగా ఎన్నికైన బీ.జే.పీ. సభ్యుల్లో ముగ్గురు గతంలో రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసినప్పటికీ.. వారిలోనుంచి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనవసరం లేదని బీ.జే.పీ. సీనియర్ నాయకుడిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీ.టీ.ఐ. పేర్కొంది.
సంబల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం ఉన్న వారిలో అగ్రగామిగా ఉన్నారు. ఇతర సంభావ్య అభ్యర్థులు సీనియర్ ఎమ్మెల్యేలు సురేష్ పూజారి, జుయల్ ఓరం, గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. బీ.జే.పీ. నిర్ణయాధికార సంస్థ అయిన పార్లమెంటరీ పార్టీ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశం కానుందని బీ.జే.పీ. భువనేశ్వర్ ఎం.పీ. అపరాజిత సారంగి తెలిపారు.