బంగాళాఖాతంలో బలమైన తుఫాను ఏర్పడుతుందని, ఇది రాబోయే రోజుల్లో దేశంలోని అనేక పశ్చిమ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ డేటా ప్రకారం… మే 23 మరియు 27 మధ్య తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. తుఫాను ప్రసరణ తీవ్రమయ్యే దశలో ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదలడానికి ముందు భారతదేశం యొక్క తూర్పు తీరంలో ల్యాండ్ఫాల్ చేసే అవకాశం ఉందని వెళ్లడించింది. తుపాను తీరం గుండా వెళితే, మే 28 నాటికి ముంబైకి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సైక్లోనిక్ తుఫాను ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్లను తాకే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్లను తాకనున్న సైక్లోనిక్ తుఫాన్…
![cyclone](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/cyclone.jpg?resize=1080%2C608&ssl=1)