ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కు సంబంధించి ఓటరు జాబితా పరిశీలకులు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు కోనసీమ జిల్లాకు రానున్నట్లు రెవెన్యూ అధికారి సీ.హెచ్ సత్తిబాబు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. గత వారంలో చేపట్టిన ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను ప్రతి నిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటర్ జాబితా పరిశీలకులు జిల్లాకు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంప్రదించవచ్చునని ఆయన సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఓటర్ నమోదు కార్యక్రమం లో ఓటరు నమోదు, సవరణల కొరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 1644 పోలింగ్ కేంద్రాలలో ఫారం-6, పారం-7, పారం-8 దరఖాస్తులు 12,221 వచ్చా యని తెలిపారు. డిసెంబర్ 9 వరకు మూడు రకాల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తదుపరి ఈ యొక్క దరఖాస్తులను డిసెంబర్ 24 లోపల పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఓటరు జాబితా పరిశీలన కోసం ప్రత్యేక పర్యాటణ… -పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు-
![WhatsApp Image 2023-12-06 at 5.06.58 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-5.06.58-PM.jpeg?resize=1296%2C700&ssl=1)