Exclusive

ఓటరు నమోదు శిబిరాలను సందర్శించిన ఈ.ఆర్.వో. …

IMG-20231203-WA0040

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ – 2024లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు సందర్శించారు. అక్కడ ఉన్న బి.ఎల్‌.వో.లు, ఇతర సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఫారం–6,7,8 ద్వారా వచ్చే ప్రతీ ఒక్క దరఖాస్తును నిర్ధారణ చేసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించారు. ఓటర్లు తుది జాబితా ప్రచురణ తేదీ దగ్గర పడుతున్నందున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై దృష్టిసారించాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను సందర్శించిన సందర్భంగా కొత్త ఓట్ల నమోదు కోసం వచ్చిన యువతతో మాట్లాడారు. ఈఆర్వో నాగనరసింహారావు భానుగుడి రిజర్వు పోలీస్‌ లైన్‌ ఆవరణలోని మున్సిపల్‌ ఉన్నతపాఠశాల, ఎల్విన్‌పేటలోని అంబేద్కర్‌ కమ్యూనిటీహాలు, రామారావుపేటలోని నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ ప్రజారోగ్య విభాగాల్లోని పోలింగ్‌స్టేషన్, రామారావుపేటలోని మున్సిపల్‌ ఉన్నతపాఠశాల, తదితర పోలింగ్‌ స్టేషన్లను ఈఆర్వో నాగనరసింహారావు సందర్శించారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.