జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రకటన చేయనున్న క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు ఇంటింటా ఓటరు జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యాలని పెద్దాపురం ఆర్డీవో సీతా రామారావు ఆదేశించారు. సామర్లకోట మున్సిపాలిటీలో అందరు బి.ఎల్.వో. లు, సూపర్వైజర్ లకు ఓటర్ జాబితాల పరిశీలన పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ జె. రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో మాట్లాడుతూ… తుది జాబితా తయారీకి గానూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. మరణించిన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించాలని, చిరునామా మారిన ఓట్లు జాబితా నుంచి తొలగించి జాబితాలోని ఓటర్ల కు సంభందించి పేర్లు, చిరునామా ఇతర తప్పులను సరిచేయ్యాలన్నారు. ఈ పరిశీలన అంతా సాధ్యమైన మేరకు త్వరితంగా పూర్తి చేయాలన్నారు. ఇంకా ఓటర్ జాబితా పరిశీలకులు సంభందించి పలు సూచనలు ఆర్డీవో చేశారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని బి ఎల్ వో లు, సూపర్ వైజర్ లు పాల్గొన్నారు.
ఓటర్ జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యండి… -ఆర్డీవో సీతారామారావు-
![IMG-20231125-WA0011](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0011.jpg?resize=1280%2C576&ssl=1)