మద్యం అమ్మకాలకు… ఓటుహక్కుకు… ఆధార్ అనుసంధానం చేయాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ప్రభుత్వానికి సూచించారు.
మద్యం అమ్మకాలను, మద్యపాన సేవనాన్ని నియంత్రణ చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం దరలు పెంచడం ద్వారా వినియోగదారుల సంఖ్య తగ్గిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
కేంద్ర రాష్ట్ర పథకాలకు, ప్రభుత్వ సేవలకు ఆధార్ అనుసంధాన విధానాన్ని ఎన్నికలకు ఎందుకు అమలు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆధార్ అనుసంధానంతో దేశంలో పౌరుడికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. దొంగ ఓట్లు, మరణఓట్లు తొలగుతాయన్నారు.