పదవ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని కమిటీ సభ్యులను కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 10వ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కమిటీ
సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదో తరగతి పరీక్షలకు 1,376 మంది హాజరు అవుతారని వీరికి 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 5,199 మంది ప్రాక్టికల్ పరీక్షలకు 3,649 మంది హాజరవుతారని వీరికి 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, డి.ఆర్.ఓ. ఎం. వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు జడ్పి సీ.ఈ.వో. ఏ. శ్రీరామచంద్రమూర్తి, తదితరులు పాల్గొన్నారు.