ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడడమే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ తెలుగు దేశం ,జనసేన పార్టీల కలయిక లో ఏర్పడ్డ పొత్తును స్వాగతించి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఫంతం నానాజీ కి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి తెలిపారు. గురువారం ఆయన నివాసంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1984 తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు దేశం పార్టీలో కొనసాగుతూ గ్రామ సర్పంచ్ గా, జిల్లాపరిషత్ సభ్యులుగా, సంపర ఎమ్మెల్యే గా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా అనేక పదవులు అందించి ప్రజలకు అనేక రూపాల్లో సేవలు అందించే విధంగా తెలుగు దేశం పార్టీ అవకాశం తమకు కల్పించందన్నారు. తాను ప్రాణం పోయేవరకు తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతానని చివరి శ్వాస విడిచిన క్షణంలో కూడా తన భౌతిక దేహం పై తెలుగు దేశం జెండా కప్పడం జరుగుతుందని పిల్లి సత్యనారాయణ మూర్తి మరోసారి స్పష్టం చేశారు.
ఔను… వారిద్దరూ ….
![pilliananthalakshmi-20-1513748876](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/pilliananthalakshmi-20-1513748876.jpg?resize=1200%2C675&ssl=1)