రేణుకాస్వామి హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను తొలిసారిగా ఆయన తల్లి, సోదరుడు, భార్య, కొడుకు పరామర్శించారు. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో వారు ఆయనను పరామర్శించారు. వారు సందర్శించినప్పుడు దర్శన్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం.
దర్శన్ తల్లి మీనా, సోదరుడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ సోమవారం ఉదయం ఆయనను పరామర్శించినట్లు పోలీసులు ధృవీకరించినట్లు ఐ.ఏ.ఎన్.ఎస్. తెలిపింది. దర్శన్కు ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులను సందర్శించడానికి అనుమతించడం కూడా కర్ణాటకలో దుమారం రేపింది.