కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బ్రౌన్ పేటకు చెందిన చెక్క ఆనంద్ కుమార్ కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆనంద్ కుమార్ విద్యుత్ స్తంభంపై షాక్కు గురై కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు.
కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి…
![Electric-Shock](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/Electric-Shock.jpg?resize=1296%2C700&ssl=1)