తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగిలింది. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్కల రోశయ్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. మృతి చేందిన వ్యక్తి భూమయ్య గా పోలీసులు నిర్ధారించారు.
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి…
![Dead](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/Dead.jpeg?resize=770%2C433&ssl=1)